మెయిన్ రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీక్.. భారీగా ట్రాఫిక్ జాం

మెయిన్ రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీక్.. భారీగా ట్రాఫిక్ జాం

కుత్బుల్లాపూర్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ గండి మైసమ్మ చౌరస్తా దగ్గర వేదిక ఫంక్షన్ హాల్ ముందు మెయిన్ రోడ్డుపై 2024 మార్చి 6 బుధవారం ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకేజీ గురించి తెలియడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అసలేం జరిగింది.. దీనికి గల కారణాలేంటని అక్కడి ప్రజలు ఆ ప్రాంతంలో భారీగా జనాలు గుమిగూడారు.

ALSO READ | రాష్ట్రంలో మరో 20 ఏండ్లు అధికారం మాదే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. గ్యాస్ పైప్ లో నుంచి మంటలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.