కశ్మీర్ లో ఉగ్రవాదం కొత్త రూపు సంతరించుకుంటోంది

కశ్మీర్ లో ఉగ్రవాదం కొత్త రూపు సంతరించుకుంటోంది

చాలా ఏళ్లుగా కశ్మీర్ లో ఉగ్రవాదం ఉందని.. కానీ ఇప్పుడది కొత్త రూపు సంతరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్. కొత్త పంథాలో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రవాదులను ఒకరిద్దరిని ప్రాణాలతో పట్టుకుంటే దాడులకు అసలు మూలాలు బయటపడతాయన్నారు ఆజాద్. చంపడం వల్ల ప్రస్తుతానికి సమస్య తీరిపోతోందని.. తర్వాత మళ్లీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఉగ్ర సంస్థల ప్లాన్ ఏంటనేది తెలుసుకుంటే కశ్మీర్ ను ఈ సమస్య నుంచి బయటపడేయవచ్చని సూచించారు.