100 కోట్లడిగితే..300 కోట్లిచ్చారు

100 కోట్లడిగితే..300 కోట్లిచ్చారు

గోవా సీఎం ఫుల్ ఖుష్

పనాజి: గోవా 60వ ఇండిపెండెన్స్ డే సెలబ్రెషన్స్ కు బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయించినందుకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​కు ట్విట్టర్​లో థ్యాంక్స్ చెప్పారు. పోర్చుగీసు పాలన నుంచి గోవా విముక్తి పొంది ఈ ఏడాదికి 60 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. డైమండ్ జూబ్లీ వేడుకలకు బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించాల్సిందిగా ఆయన ప్రపోజల్ పెట్టారు. బడ్జెట్ లో 300 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మల ప్రకటించడంతో సావంత్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ మొత్తాన్నీ సెలబ్రేషన్స్ తో పాటు గోవాలోని హిస్టారికల్ ప్లేసెస్ డెవలప్​మెంట్​కు ఖర్చు చేస్తామన్నారు.