గంటలో 2వేల మొక్కలు నాటడమే లక్ష్యం: మంత్రి తలసాని

గంటలో 2వేల మొక్కలు నాటడమే లక్ష్యం: మంత్రి తలసాని

ఒక గంటలో రెండు వేల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ బుద్ధభవనంలో ఈ నెల 4న చేపట్టనున్న హరితహారం కార్యక్రమంపై అధికారులుతో సమావేశమై చర్చించారు.

సనత్ నగర్ నియోజక వర్గంలో 4వ తేదీన 10గంటల నుండి 11గంటల వరకు ఒక గంటలో 2వేల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు మంత్రి  తలసాని. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఇంద్ర కరణ్ రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ లు కూడా పాల్గొంటారన్నారు.

హరితహారం కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ,స్వచ్చంద సంస్థలతో పాటు కాలేజీ విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు మంత్రి తలసాని.