ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగిన్రు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగిన్రు :  రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని ప్రశ్నించారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి.  ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని నిలదీశారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు.  బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణని పట్టుకోవాలని సవాల్ విసిరారు.  నీరవ్ మోదీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయాడని రేణుకా చౌదరి విమర్శించారు.  ప్రజ్వల్ రేవణ్ణని బలపరిస్తే తనని  బలపర్చినట్టే అని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.  బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని ప్రశ్నించారు.  

బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేస్తే మళ్ళీ ఆయన కుటుంబానికే ఎందుకు టికెట్ ఇచ్చారని మోదీని రేణుకా చౌదరి ప్రశ్నించారు. దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని అడిగారు. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు.  చాలామంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్ కి వస్తున్నారంటూ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.  మోదీ పెద్ద ఛాతీ ఉండడం కాదు. దానిలో గుండె, మనసు కూడా ఉండాలని చెప్పారు.