నరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ

నరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ

పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. SSN కాలేజీ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోస్టల్​ బ్యాలెట్​ ఉపయోగించుకుని ఓటు వేసేందుకు వస్తున్న ఉద్యోగులను వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  అనుచరులు ఓటు వేసే ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారని   ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఈ క్రమంలో టీడీపీ నేతలకారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలింగ్​ కేంద్రం వద్ద బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఓటర్లు ఆరోపిస్తున్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.