పెళ్లై ఇద్దరు పిల్లులు.. ఇన్స్ స్టాలో యువకుడితో పరిచయం.. ప్రియుడు కోసం భర్త హత్య.. సీన్ కట్ చేస్తే..!

పెళ్లై ఇద్దరు పిల్లులు.. ఇన్స్ స్టాలో యువకుడితో పరిచయం.. ప్రియుడు కోసం భర్త హత్య.. సీన్ కట్ చేస్తే..!

పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఓ మహిళకు ఇన్స్‎స్టా గ్రామ్‎లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. జ్యూస్‎లో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత దిండుతో గొంతు నులిమి చంపేసింది. అనంతరం గుండెపోటు అంటూ ఏమి తెలియనట్లుగా భర్తను ఆసుపత్రికి తరలించింది. అయితే, భర్త మరణం తర్వాత సదరు మహిళ ప్రియుడితో మాట్లాడటం మానేయడంతో అసలు విషయం బయటపడింది. సినిమా స్టోరీని తలపించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‎లోని కాకినాడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

కాకినాడ జిల్లా సర్పవరం మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్‌ (38), దేవి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. భర్త ఆటో నడుపుతాడు. రెండేళ్ల కింద దుర్గాప్రసాద్‌ గుండెలో స్టంట్లు వేశారు. దాంతో అతను ఇంటి వద్దే ఉండేవాడు. ఈ క్రమంలో దేవికి ఇన్‌స్టాగ్రామ్‌లో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపిసాయి బైక్‌పై బాపట్ల నుంచి సర్పవరం వచ్చి.. దేవిని విజయవాడ, రామచంద్రపురం తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. భార్య వ్యవహారంపై అనుమానం రావడంతో దుర్గాప్రసాద్‌ నిలదీశాడు. 

ఫోన్‌లో చాటింగ్‌ చేయకుండా నిలువరించాడు. అయినప్పటికీ దేవి ప్రియుడితో సంబంధం కొనసాగించింది. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు, నిద్రమాత్రలతో హతమారుద్దామని ప్లాన్‌ వేసి ప్రియుడికి చెప్పింది. దీంతో గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్రమాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇచ్చాడు. 

►ALSO READ | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. GPS అమర్చిన పెంపుడు కుక్క మృతి

ఈ ఏడాది మార్చి 13న ఖర్జూజ జ్యూస్‌లో 13 నిద్రమాత్రలు వేసి భర్తతో తాగించింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లగా, బతుకుతాడేమోనన్న భావనతో ముఖంపై దిండు అదిమి పట్టుకుని ఊపిరాడకుండా హతమార్చింది. అనంతరం భర్తకు గుండెపోటు వచ్చిందని దుర్గాప్రసాద్‌ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

నిందితురాలిని పట్టించిన ప్రియుడు..!

అయితే భర్త హత్య అనంతరం దేవి ప్రియుడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమె తనకు దూరమవుతుందని, వేరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నట్లు భావించిన గోపిసాయి.. మూడు నెలల తర్వాత ఈ నెల 9న దేవి కుమార్తె సెల్‌ఫోన్‌కు వాట్సా్‌పలో ఓ మెసేజ్‌ పంపాడు. ‘మీ నాన్నను మీ అమ్మే చంపేసింది. 

నిద్రమాత్రలను నేనే మీ అమ్మకు ఇచ్చాను’ అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో మృతుడి సోదరుడు సత్తిబాబు దుర్గాప్రసాద్‌ది సహజ మరణం కాదని, అతని భార్యనే హత్య చేసిందని భావించి ఈనెల 9న సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు