హైదరాబాద్ సిటీ, వెలుగు: సోమవారం నుంచి ప్రభుత్వ స్కూల్స్ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్స్కీం కూడా షురూ కానున్నది. మొదటి దశలో భాగంగా 45 ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ..రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్లో ఈ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ స్కీం లో భాగంగా 12,437 విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రోజూ ఒక టిఫిన్చొప్పున మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, మిక్సుడ్వెజ్ కుర్మాతో పూరీ, చట్నీతో బోండా, ఉప్మా చట్నీ, దోశ పెట్టబోతున్నట్టు చెప్పారు. 672 ప్రభుత్వ స్కూల్స్లో బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
