తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్: చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్: చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ : తాళం  వేసి  ఉన్న ఇళ్లే  టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు  హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆమనగల్ కి చెందిన వినోద్ కుమార్ బిటెక్ చదివి మధ్యలో ఆపేశాడు. కార్ డ్రైవర్ గా పని చేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలు పెట్టాడన్నారు సీపీ. 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. 2017లో పిడి యాక్ట్ పై జైలుకి వెళ్లొచ్చినా….  చోరీలు మానలేదన్నారు. వీరికోసం 4 జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని… నిందితుడి వినోద్ కుమార్ పై మళ్లీ పిడియాక్ట్ నమోదు చేస్తున్నామని చెప్పారు సీపీ.