కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా గిఫ్ట్....

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా గిఫ్ట్....

ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ తాజాగా గెజిట్ జారీ చేశారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కారు జీవో జారీచేసిన విషయం తెలిసిందే. ఆ సంఖ్య పెంచాలని నిరుద్యోగులు కోరారు. దీంతో వారిని సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీపీఎస్సీ మొత్తం 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.