గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తవగా, తాజాగా క్లైమాక్స్ సీక్వెన్స్ని స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో హై ఇంటెన్సిటీ సీన్స్ను షూట్ చేస్తున్నారు.
రాత్రిపూట చిత్రీకరిస్తున్న క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ను నిర్మించారు. 25 రోజుల లెంగ్తీ షెడ్యూల్ జరగనుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ హైలైట్గా నిలుస్తుందని, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని చెప్పారు. గోపీచంద్ కెరీర్లో ఇది 33వ సినిమా. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో చారిత్రక యోధుడిలా గోపీచంద్ కనిపించనున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు.
