బషీర్ బాగ్, వెలుగు: బీజేపీ కంచుకోటగా ఉన్న గోషామహల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని బీఆర్ఎస్అధిష్టానం ప్రయత్నిస్తున్న టైంలో ఆ పార్టీ లీడర్ల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం లీడర్ల వర్గపోరు తార స్థాయికి చేరింది. కొత్తగా నియమించిన బీఆర్ఎస్నియోజకవర్గ ఇంచార్జ్ నంద్ కిశోర్ వ్యాస్( బిలాల్)కు, ఆ పార్టీ స్థానిక సీనియర్ నాయకులకు అస్సలు పడటం లేదు. ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి నంద్ కిశోర్ వ్యాస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.
ఇన్చార్జ్ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గ బీఆర్ఎస్ఆఫీస్కొనసాగుతుండగా, గురువారం ఆ పార్టీ లీడర్సంతోశ్ గుప్తా మరో ఆఫీస్ప్రారంభించాడు. మాజీ కార్పొరేటర్లు , ఉద్యమకారులు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ శుక్రవారం ఓ హోటల్ లో నందకిశోర్కు వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. ఇన్చార్జ్వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో కార్పొరేటర్లుగా సేవలందించిన తమకు గుర్తింపు దక్కడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందకిశోర్ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ డివిజన్లలో తమకు తెలియకుండా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలంటే ఇన్చార్జ్ను మార్చాల్సిందేనని అంటున్నారు.
