రేపు (జూలై 1న) ప్రజాభవన్లో బనకచర్లపై ప్రజెంటేషన్

రేపు (జూలై 1న) ప్రజాభవన్లో బనకచర్లపై ప్రజెంటేషన్

హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించనున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మంగళవారం ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ఇవ్వనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ దాని గురించి తెలియజేసేందుకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్​శాఖ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ప్రజెంటేషన్​లో వివరించాల్సిన అంశాలపై చర్చించారు.

తెలంగాణ ప్రయోజనాలు ఏవిధంగా దెబ్బతింటాయో.. దాని వెనక ఆనాటి రాజకీయా కారణాలేంటో తెలిసేలా పీపీటీలను తయారు చేయించారు. ప్రజాభవన్ లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు  ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే కార్పొరేషన్ల​చైర్మన్లు, డైరెక్టర్లకు దీని గురించి వివరించనున్నారు.