
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించనున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మంగళవారం ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ఇవ్వనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ దాని గురించి తెలియజేసేందుకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్శాఖ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ప్రజెంటేషన్లో వివరించాల్సిన అంశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రయోజనాలు ఏవిధంగా దెబ్బతింటాయో.. దాని వెనక ఆనాటి రాజకీయా కారణాలేంటో తెలిసేలా పీపీటీలను తయారు చేయించారు. ప్రజాభవన్ లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే కార్పొరేషన్లచైర్మన్లు, డైరెక్టర్లకు దీని గురించి వివరించనున్నారు.