హైదరాబాద్, వెలుగు: లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశం అయ్యారు. బుధవారం లోక్ భవన్లో గవర్నర్ స్పెషల్ సీఎస్ దానకిషోర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గవర్నర్ మాట్లాడుతూ, బాధ్యతతో విధులు నిర్వహించి లోక్భవన్ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు.
అనంతరం ఉద్యోగుల కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లోక్భవన్లో పనిచేసే ఉద్యోగులకు హోదాతో సంబంధం లేకుండా లోక్ భవన్ ఉద్యోగిగా గుర్తింపు ఉంటుందన్నారు. లోక్భవన్లో పనిచేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
