యాదాద్రి సేవలో గవర్నర్ తమిళి సై

యాదాద్రి సేవలో గవర్నర్ తమిళి సై

గవర్నర్ తమిళి సై యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.   జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలయ ఈవో గీత ఆమెకు స్వాగతం పలికారు. యాదాద్రి ప్రధానాలయంను సందర్శించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ ప్రసంగానికి ముందు గవర్నర్ స్పీచ్ తొలగింపుపై తమిళి సై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ సభ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారన్నారు. బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని  న్నారు.. బడ్జెట్ లో తన స్పీచ్ లేకపోవడంపై తన అభిప్రాయం చెప్పానన్నారు. ప్రజలు క్షేమంగా ఉండటమే తనకు కావాలన్నారు.