ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం: గవర్నర్ తమిళిసై

ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం: గవర్నర్ తమిళిసై

దశాబ్ధాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని గవర్నర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో ఉన్న ఓ ట్విటర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ లో జోడించారు. దీనితో పాటు కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫోటోలను కూడా గవర్నర్ ట్వీట్ కు జత చేశారు. 

ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆసుత్రికి దక్కిందని అన్నారు. జస్టిస్ ఫర్ ఓజీహెచ్ చేసిన ట్వీట్ ను గవర్నర్ తమిళిసై రీట్వీట్ చేస్తూ.. ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాటని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.