మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన గవర్నర్ ఫ్యామిలీ

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన గవర్నర్ ఫ్యామిలీ

హైదరాబాద్ సిటీకి మెట్రో రైల్ తలమానికం అన్నారు గవర్నర్ నరసింహన్. మంగళవారం ప్యామిలీతో కలిసి ఆయన మెట్రో రైలులో ప్రయాణిచారు. అమీర్ పేట్ నుంచి నాగోల్, నాగోల్ నుంచి బేగంపేట్ వరకు ప్రయాణించారు గవర్నర్ కుటుంబ సభ్యులు. ఉప్పల్ మెట్రో డిపోను పరిశీలించారు గవర్నర్.. మెట్రో ప్రారంభానికి ముందు ఇప్పుడు రెండు సార్లు ప్రయాణం చేశానని తెలిపారు.

మెట్రో ప్రారంభం కంటే ఇప్పుడు ప్రయాణికులకు చాలా సౌకర్యాలు వచ్చాయన్నారు. కుటుంబంతో కలిసి మెట్రో ప్రయాణం చేయడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్.