
కొత్తగా బైక్కొనాలనుకుంటున్నారా..అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..కొత్తగా బైకు కొనుగోలు చేసేవారికి, బైకులను అమ్మే డీలర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. ఇప్పటివరకు మనం ద్విచక్రవాహనం మాత్రమే కొనుగోలు చేసేవాళ్లం..ఇప్పటినుంచి అలా కాదు.. బైకు కొనుగోలు చేస్తే హెల్మెట్ తప్పనిసరిగా చేసింది. బైకులు విక్రయించే డీలర్లు కంపల్సరీ రెండు హెల్మెట్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
బైక్ తయారీ కంపెనీలు వాహనం కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రెండు హెల్మెట్లను అందించాని ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఈ కొత్త నిబంధన అమలు చేసేందుకు కేంద్ర మోటార్ వెహికల్ నియమాల్లో మార్పులకు ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. కొత్త సవరణ నియమాల తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ నియమం తప్పనిసరి అవుతుంది.
జూన్ 23, 2025న ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం. కొత్త నియమం రైడర్లు ,పిలియన్ ప్రయాణీకులకు రోడ్డు భద్రతను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో సెంట్రల్ మోటార్ వెహికల్స్ (సవరణ) నియమాలు, 2025 ప్రారంభమైన తేదీ నుంచి మూడు నెలల తర్వాత బైక్ మాన్యుఫ్యాక్చరర్లు కొనుగోలు చేసే సమయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా రెండు హెల్మెట్లను సరఫరా చేయాలి.
అందించే హెల్మెట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అయితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 కింద మినహాయింపు పొందిన వ్యక్తులకు ఈ అవసరం వర్తించదు.
►ALSO READ | ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. గాల్లో ఉండగానే వెనక్కి.. ఏమైందంటే.. ?
హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది. జనవరి 1, 2026 నుంచి అన్ని కొత్త L2 కేటగిరీ ద్విచక్ర వాహనాలు వీటిలో 50cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం లేదా 50 km/h కంటే ఎక్కువ వేగం కలిగిన మోటార్ సైకిళ్ళు ,స్కూటర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS)తో అమర్చాలి.ABS తప్పనిసరిగా ఇండియన్ స్టాండర్డ్ IS14664:2010 కు అనుగుణంగా ఉండాలి.ఇది ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో స్కిడ్డింగ్ అవకాశాలను తగ్గిస్తుంది.
ప్రతిపాదిత నియమాలు ప్రస్తుతం ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచారు. పౌరులు,స్టేక్ హోల్డర్లు వారి సూచనలు లేదా అభ్యంతరాలను పంపడానికి గడువు ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల సమయం ఉంది. comments-morth@gov.in కు ఇమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖతో అభిప్రాయాలను షేర్ చేయొచ్చు.
దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నంలో ఇది ఒక భాగం. హెల్మెట్లు ,ABSలను తప్పనిసరి చేయడం ద్వారా బైకులతో జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ,తీవ్రమైన గాయాలను తగ్గించాలనేది మంత్రిత్వ లక్ష్యం.