రాత్రికి రాత్రే శ్మశానవాటిక కబ్జాకు యత్నం

రాత్రికి రాత్రే శ్మశానవాటిక కబ్జాకు యత్నం

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లో భూమి ధరలు అకాశాన్నంటాయి. గజం లక్షలు పలికే మాదాపూర్​లో స్థలం కనబడితే కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు. శ్మశానవాటికను సైతం వదలకుండా రాత్రికిరాత్రే మట్టిపోసి కబ్జాలకు పాల్పడుతున్నారు. మాదాపూర్​ఖానామేట్​చంద్రనాయక్​తండాలో గిరిజనులకు చెందిన 35 గుంటల శ్మశానవాటిక స్థలం ఉంది. దీనిని కబ్జా చేసేందుకు మంగళవారం రాత్రి మట్టి పోసి చదును చేశారు. సమాచారం అందుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కబ్జాదారులను అడ్డుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు శివనాయక్, తారునాయక్, హున్యానాయక్​లు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.