గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పోస్ట్ పోన్

గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్  పోస్ట్ పోన్

హైదరాబాద్: గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పై TGPSC కీలక నిర్ణయం తీసుకుంది.గ్రూప్ 3 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వాయిదా వేసింది TGPSC. గ్రూప్ 2 నియామకాలు పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించాలని TGPSC ప్రకటించింది. బ్యాక్ లాగ్ పోస్టులతో సమస్య రాకుండా ఉండాలనే ఉద్దేవంలో గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేన్ వాయిదా వేసింది TGPSC .

1388 పోస్టుల కోసం గ్రూప్-3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 18, 2025 నుండి జులై 8, 2025 వరకు, రిజర్వ్ డే జులై 9 నిర్వహించాలని ఇప్పటికే షెడ్యూల్ చేసింది. గ్రూప్ 2 నియామకాలు చేపడితే మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులతో సమస్య రాకుండా ఉండేందుకు గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు TGPSC ప్రకటించింది. 

గతంలో గ్రూప్‌-3కి సంబంధించి 1,388 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెల్సిందే. దానికి సంబంధించి రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను మార్చి 15న విడుదల చేసింది. తాజాగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌తో పాటు అందుకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.