500 కోట్ల మోసం చేసిన ఆరోపణలతో ఓ వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకే భవనాన్ని 25 మందికి అమ్మడం ద్వారా మోసాలకుపాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూ.2.5 కోట్లకు యూనిట్ కొనుగోలు చేసిన నిందితుడు దానిని 25మందికి విక్రయించాడు. ఆతర్వాత ఓ కంపెనీకి లీజుకు ఇవ్వడం ద్వారా 500కోట్లు దండుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిందితుడికి 6రోజుల పోలీసు రిమాండ్
నిందితుడు 32వ మైల్ స్టోన్ డైరెక్టర్ ధృవ్ శర్మను అరెస్ట్ చేశారు గురుగ్రామ్ పోలీసులు. కోర్టు హాజరు పర్చగా నిందితుడికి ఆరు రోజుల కస్టడీ విధించింది. నిందితుడు 25మందికి పైగా వ్యక్తులను మోసం చేసి రూ. 500కోట్ల మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మోసం ఎలా బయటపడిందంటే..
జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఆప్రా మోటెల్స్ (32వ మైల్ స్టోన్విస్టా ప్రైవేట్ లిమిటెడ్ )పై ఫిర్యాదు చేయడంతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 32వ మైల్ స్టోన్ కాంప్లెక్స్ లో రూ.2.5కోట్లతో మొదటి అంతస్తులోని యూనిట్ నం 24 ను కొనుగోలు చేసేందుకు ట్రాం వెంచర్స్ ముందుకొచ్చింది. అయితే చెల్లింపుల తర్వాత కూడా కన్వీనియన్స్ డీడ్ ఇవ్వలేదు. ఫిర్యాదు దారుడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో.. లీగల్ నోటీసులు ఇచ్చాడు. అయినా స్పందించలేదు.
ఇదే యూనిట్ కు అమ్మకానికి సంబంధించి మరో 25 మందిపేర్లతో కన్వీనియన్స్ డీడ్ఇచ్చినట్లు ట్రాం వెంచర్స్ కంపెనీ గుర్తించింది. దీంతో పో లీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 32వ మైల్ స్టోన్ కంపెనీ డైరెక్టర్ ధృవ్ శర్మను శుక్రవారం (ఫిబ్రవరి 6)అరెస్ట్ చేశారు.
నిందితుడు ధృవ్ శర్మ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తన సహచరులతో కలిసి 2021లో 32వ మైల్ స్టోన్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తును రూ. 2.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు. అదే అంతస్తును మరో 25 మందికి విక్రయించినట్లు తెలిపారు. ఆ తర్వాత తన మరో సంస్థ పేరుతో మొత్తం 25 మంది వ్యక్తులనుంచి 30ఏళ్లపాటు అదే అంతస్తును లీజుకు తీసుకొని మోసం చేసినట్లు తెలిపారు.
