కేసీఆర్‌‌‌‌తో హరీశ్‌‌‌‌రావు భేటీ.. ఎర్రవెల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కలిసిన మాజీమంత్రి

కేసీఆర్‌‌‌‌తో హరీశ్‌‌‌‌రావు భేటీ.. ఎర్రవెల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో  కలిసిన మాజీమంత్రి

ములుగు, వెలుగు : మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు బుధవారం ఎర్రవెల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసుకు సంబంధించి సిట్‌‌‌‌ విచారణలో జరిగిన పరిణామాలు, తానిచ్చిన వాంగ్మూలం, ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలు తదితర అంశాలను కేసీఆర్‌‌‌‌కు వివరించినట్లు సమాచారం. 

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో జరుగుతున్న విచారణ రాజకీయ ప్రేరేపితంగా సాగుతోందని, ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కేసీఆర్‌‌‌‌కు చెప్పినట్లు తెలిసింది. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్‌‌‌‌ కార్యాచరణ, రాబోయే రాజకీయ సవాళ్లపై కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఈ భేటీలో అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.