అందుబాటులోకి  మరో నాలుగు క్యాథ్ ల్యాబ్ లు

 అందుబాటులోకి  మరో నాలుగు క్యాథ్ ల్యాబ్ లు

కోర్టు కేసు పూర్తవగానే ఉస్మానియా పాత భవనం సమస్యను పరిష్కరిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. ఇవాళ (మంగళవారం) ఉస్మానియా ఆస్పత్రిలో క్యాథ్ లాబ్, సిటి స్కాన్ ను ప్రారంభించారు హరీశ్.. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు క్యాథ్ ల్యాబ్ లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఉస్మానియాలో 5 కోట్ల రూపాయలతో అధునాతన మార్చురీని ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ ఘన విజయం సాధించి.. తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు.