అన్ని వర్గాలకు అండగా ఒక్క టీఆర్ఎస్సే

అన్ని వర్గాలకు అండగా ఒక్క టీఆర్ఎస్సే

సిద్దిపేట జిల్లా: గజ్వేల్ పట్టణంలో క్రిస్టియన్ భవన్ ని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. నియోజకవర్గంలోని క్రైస్తవులందరికి బట్టలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొట్ట మొదటి క్రైస్తవ భవనాన్ని గజ్వేల్ ప్రారంభించుకున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా ఉండేది ఒక్క టీఆర్ఎసే అన్నారు హరీశ్. 

అనంతరం క్రిస్టియన్ భవన్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. నిరుపేద‌లు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. అందుకు గజ్వేల్ నియోజకవర్గమే నిదర్శనమన్న హరీశ్.. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు..

మరిన్ని వార్తల కోసం

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి