కాసానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ​ పరామర్శ

కాసానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ​ పరామర్శ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ త్వరగా కోలుకోవాలని హర్యానా గవర్నర్  బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన జ్ఞానేశ్వర్​ను  దత్తాత్రేయ శుక్రవారం అమీర్‌‌పేట శ్రీనివాస కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనను దత్తాత్రేయ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పలకరించారు.

ALSO READ: జర్నలిస్టులను బ్యాన్ చేసుడేంది? : రాణి రుద్రమ 

ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జ్ఞానేశ్వర్  తన పాత మిత్రుడని దత్తాత్రేయ తెలిపారు.