జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్నో పండుగలు వస్తుంటాయి. కానీ, దేశమంతా ఒక్కటై చేసుకునే పండుగలు రెండే రెండు. ఒకటి స్వాతంత్ర్య, రెండోది గణతంత్ర దినోత్సవం. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, హాస్పిటల్స్.. ఎక్కడున్నాసరే మనవాళ్లు ఆ రోజుల్లో దేశభక్తిని చాటుకుంటారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనదేశ ప్రధాని జులైలో ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాని మీద ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగి ఒకరు సముద్రం అడుగున జెండా ఎగరేసి తన దేశభక్తిని చాటాడు. దాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దానికి ‘హర్ ఘర్ తిరంగా’, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అని ట్యాగ్ చేసి, ఈ విషయం రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు.
“हर घर तिरंगा”
— Sambit Patra (@sambitswaraj) July 30, 2022
To commemorate the 75 years of India’s Independence, @IndiaCoastGuard performed an underwater flag Demo at Sea. This creative gesture will invoke the feeling of patriotism in the citizens of India.#HarGharTiranga#AzadiKaAmritMahotsav pic.twitter.com/DYhdXds6SX