బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించండి

బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించండి

దేశాన్ని బ్లాక్ ఫంగస్ కలవర పెడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా  ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం. ఇప్పటికే దేశంలో వెయ్యికిపైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ లోనే వందకు పైగా కేసులు నమోదవడంతో.... అక్కడి సర్కారు బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించింది. ఏపీ సర్కారు కూడా మూడు రోజుల కిందటే బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చింది.