హుస్సేన్‌ సాగర్‌లోకి భారీగా వరద నీరు

హుస్సేన్‌ సాగర్‌లోకి భారీగా వరద నీరు

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పైనుంచి వరద ప్రవాహం వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీ కాల్వలోకి విడుదల చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొత్తం 26 తూముల ద్వారా 3,486 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కవాడిగూడ, అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, కోరంటి ఆసుపత్రి, సత్యానగర్‌, రత్నానగర్‌ మీదుగా మూసీ ప్రధాన కాల్వలోకి వరద నీటిని విడుదల చేశారు. నాలల పరీవాహక ప్రాంతంలో ఉన్న నివాసితులను అధికారులు అలర్ట్ చేశారు. ప్రజలు నదిలోకి దిగరాదని హెచ్చరికలు జారీ చేశారు.