
హాలియా, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద వస్తోంది. ఎగువ నుంచి 2,60,844 క్యూసెక్కుల వరద వస్తుండగా, 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,09,508 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589. 60 అడుగులు( 310. 8498 టీఎంసీల) నీటి మట్టానికి చేరుకుంది.
ఎడమ కాల్వకు 6,325 క్యూసెక్కులు, కుడి కాల్వకు 9,019 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 2,400 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,292 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.