రాష్ట్రంలో జోరు వానలు పడుతున్నాయి.ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. హైదరాబాద్ నగరం సహా… రాష్ట్రంలోని పలుజిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్ లో ఈ మధ్యాహ్నం భారీవర్షం పడింది. ఆ తర్వాత కూడా జల్లులు కొనసాగాయి.
ఉమ్మడి కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ , ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.