రైతుబంధు వారోత్సవం.. భారీగా ట్రాఫిక్ జామ్

 రైతుబంధు వారోత్సవం.. భారీగా ట్రాఫిక్ జామ్

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపాలిటీలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. రాయగిరి నుంచి భువనగిరి పట్టణం వరకు ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు. భువనగిరి MLA శేఖర్ రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.  ర్యాలీ సాయిబాబా గుడి, పాతబస్టాండ్, వినాయక్ చౌరస్తా,  హైదరాబాద్ చౌరస్తా మీదుగా కొనసాగింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్రఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారి పై గంటల కొద్దీ వాహనాలు నిలిచి పోయాయి. ట్రాఫిక్ లో ఓ అంబులెన్స్ ఇరుక్కోవటంతో.. అతికష్టం మీద బయటకు పంపించగలిగారు. కరోనా విజృభిస్తున్న సమయంలో..  ఇలా భారీ ర్యాలీలకి అనుమతులు ఇవ్వటం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.