వీళ్లా హీరో ఫ్యాన్స్ : సినిమా ధియేటర్ ధ్వంసం చేసేశారు

వీళ్లా హీరో ఫ్యాన్స్ : సినిమా ధియేటర్ ధ్వంసం చేసేశారు

ఈ మధ్య స్టార్ హీరో సినిమా ట్రైలర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో సినిమాకు ఫుల్ క్రేజ్ వస్తోంది. స్టార్ హీరోల అభిమానులు కూడా మా హీరో రేంజ్ ఇది అంటూ రెచ్చిపోతున్నారు. థియేటర్స్ లో నా నా హంగామా చేస్తున్నారు. అటు సినిమా మేకర్స్, ఇటు ఫ్యాన్స్ పరిస్థితి బాగానే ఉంది కానీ.. థియేటర్స్ యాజమాన్యం పరిస్థితి మాత్రం దారుణంగా తయారయింది. ఫ్యాన్స్ చేసే రచ్చకు  థియేటర్స్ అన్నీ నాశనం అవుతున్నాయి. స్క్రీన్స్ చించేస్తూ, చైర్స్ విరగ్గొడుతూ నా నా రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో థియేటర్స్ యాజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారు. 

తాజాగా తలపతి విజయ్ ఫ్యాన్స్ ఇలాగే రెచ్చిపోయారు.  ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లియో. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా లియో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తమిళనాడులోని  కొన్ని ప్రాంతాల్లో లియో ట్రైలర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్లుగా రెచ్చిపోయారు. ట్రైలర్ బాగానే ఉంది కానీ.. తమిళనాడులోని పాపులర్ రోహిణి థియేటర్ ని పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడా థియేటర్ రిపేర్ కి సుమారు లక్షలలో ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. పాపం  ఈ థియేటర్ ఓనర్ కు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.