శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారా యణ’. మార్చి 1న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో యిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ ‘‘నాది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చేశా. ఫైనల్ ఇయర్లో ఉండగా ఎయిర్ హోస్టెస్గా జాబ్ వచ్చింది. ఏడాది పాటు జాబ్ చేసి, సినిమాలపై ఆసక్తి తో ఈవైపు ప్రయత్నాలు స్టార్ట్ చేశాను.
అలా ఆది సాయికుమార్కు జంటగా ‘శశి’, సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఆడిషన్స్కు వెళ్లి సెలెక్ట్ అయ్యా. ఇందులో నా పాత్ర పేరు లక్ష్మీ. పక్కింటమ్మాయి తరహాలో కనిపించినా, క్రైమ్ రిపోర్టర్గా స్ట్రాంగ్ క్యారెక్టర్ నాది. సస్పెన్స్తో పాటు థ్రిల్, రొమాన్స్, పాటలు అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఆద్యంతం ఉంటుంది.
క్లైమాక్స్ని చివరి వరకూ ఎవరూ గెస్ చేయలేరు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. శివ కందుకూరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో. చాలా వినయంగా, ఓపికగా ఉంటారు. డైరెక్టర్ పురుషోత్తం విజన్ క్లియర్గా ఉంటుంది. ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది. ఇక నాకు అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని ఉంది. కథ నచ్చితే గ్లామరస్ రోల్స్ చేయడానికి సిద్ధమే. అలాగే మాస్ రోల్స్ చేయాలనుంది. ప్రస్తుతం సుహాస్తో ‘ప్రసన్న వదనం’ చేస్తున్నా. అందులో నా పాత్రకి నేనే తెలుగులో డబ్బింగ్ చెబుతున్నా” అని చెప్పింది.