ఆడవారి మాటలకి అర్దాలు వేరులే సీక్వెల్కు ప్లాన్..రెడీ అంటున్న త్రిష

ఆడవారి మాటలకి అర్దాలు వేరులే  సీక్వెల్కు ప్లాన్..రెడీ అంటున్న త్రిష

కొన్ని క్లాసిక్ మూవీస్ ఎన్ని సంవత్సరాలు గడిచినా అలా గుర్తుండిపోతాయి. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా వచ్చిన ఆడవారి మాటలకి అర్దాలు వేరులే. డైరెక్టర్ సెల్వ రాఘవన్(Selvaraghavan) తెరకెక్కించిన ఈ మూవీ ఫ్యామిలీ, లవ్ కం ఎమోషనల్ గా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు అవుతున్న ఇప్పటికే ఎవర్ గ్రీన్ గా నిలిచింది. లేటెస్ట్గా ఈ మూవీ సీక్వెల్లో యాక్ట్ చేయడానికి రెడీ అంటూ త్రిష(Trisha) ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అసలు విషయానికి వస్తే డైరెక్టర్ సెల్వ రాఘవన్ పదేళ్ల క్రితం ఓ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ కి..త్రిష ఇప్పుడు రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.అప్పట్లో డైరెక్టర్ ట్వీట్ చేస్తూ..ఇప్పుడే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూశాను. వెంకీ, త్రిష తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని ట్వీట్ చేశారు. దీంతో వీరిద్దరి ట్వీట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా అందించిన సాంగ్స్ ఇప్పటికీ..ఆడియన్స్ ఫేవరేట్ ఆల్బమ్లో నెంబర్ వన్గా ఉంటుంది.  

విక్టరీ వెంకటేష్..త్రిష కామో వచ్చిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.వీరిద్దరి కలయికలో వచ్చిన ప్రతి మూవీలో లవ్ టచ్ చేయడంతో పాటుగా..ఎమోషన్స్ సీన్స్ ఎక్కువ ఉండటంతో హిట్ కాంబోగా వీరికి పేరు ఉంది. ఇక ఆడవారి మాటలకి అర్దాలే వేరులే మూవీ సీక్వెల్ వస్తే కనుక ఆడియన్స్ ఫిదా అవ్వటం కన్ఫమ్ అంటున్నారు సినీ క్రిటిక్స్. ఇప్పటికే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న త్రిష ఈ ట్వీట్ చేయడంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.