
హైదరాబాద్ లో కిడ్నాప్ జరిగింది. వనస్థలిపురంలోని సరస్వతినగర్ SNR అపార్ట్ మెంట్ నుంచే ఈ కిడ్నాప్ జరగటం సంచలనంగా మారింది. హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పని చేస్తున్న పాలడుగు నారాయణను.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. కారులో వచ్చి ఎత్తుకెళ్లారు.
అడ్వకేట్ నారాయణను కిడ్నాప్ చేసిన తర్వాత.. నిందితులు అతని భార్యకు కాల్ చేశారు. కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. ఈ విషయాన్ని అడ్వకేట్ భార్య.. పోలీసులకు కంప్లయింట్ చేయటంతో బయటకు వచ్చింది. కిడ్నాప్ అయిన నారాయణ కోసం.. కిడ్నాపర్ల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. సిటీ అంతా గాలిస్తున్నారు. అడ్వకేట్ భార్యకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా లొకేషన్ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
కిడ్నాపర్లు కాల్ చేసిన లొకేషన్, నెంబర్ ఆధారంగా సిటీలో గాలిస్తున్నారు పోలీసులు. అడ్వకేట్ కిడ్నాప్ వెనక.. భూ వివాదానికి సంబంధించిన లావాదేవీలు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భూ వివాదం కారణంగా కిడ్నాప్ చేసినట్లు భావిస్తూ.. ఆ దిశగానూ విచారణ చేస్తున్నారు. సిటీలో పట్టపగలు ఓ అడ్వకేట్ కిడ్నాప్ సంచలనంగా మారింది. కేసును సవాల్ గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. కేసును ఛేదించే పనిలో ఉన్నారు.