గడ్డి అన్నారం మార్కెట్ తరలింపు పై హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వు

గడ్డి అన్నారం మార్కెట్ తరలింపు పై హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వు

హైదరాబాద్: గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు వ్యవహారంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రీజర్వ్ చేసింది హైకోర్టు. గతంలో మార్కెట్ తరలింపు పై హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో బాటసింగారం వద్ద మార్కెట్ తరలింపు సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేసిన అడ్వకేట్ కమిషనర్ హైకోర్టు కు నివేదిక సమర్పించారు. గడ్డి అన్నారం మార్కెట్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎజి వివరించారు. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు రీజర్వ్ చేసింది.