ఏక సభ్య కమిషన్‌ రిపోర్ట్ ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు : హైకోర్టులో ప్రభుత్వం వాదన

ఏక సభ్య కమిషన్‌ రిపోర్ట్ ఆధారంగానే  బీసీ రిజర్వేషన్లు  :  హైకోర్టులో ప్రభుత్వం వాదన

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వాడివేడీగా కొనసాగుతున్నాయి.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వాదనలు ఆసక్తిగా జరుగుతున్నాయి. అక్టోబర్ 8న ఉదయం పిటిషనర్ల తరపున లాయర్లు వాదనలు వినిపించగా..   ప్రభుత్వం తరపున అడ్వకెట్ జనరల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. 

ప్రభుత్వం తరపున  అభిషేక్ మను సింఘ్వీ వాదనలు

  • దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సమర్థించాయి
  • చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు
  • కాకపోతే చట్టం ఆధారంగా జారీ చేసిన జీవోలను ఛాలెంజ్ చేశారు
  • జీవోకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదు
  • రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతం దాటకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశమే తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి నిబంధన ఈ పరిమితి విధించలేదు
  • డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది
  • 2018లో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదు
  • 2019లో EWS 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. 
  • ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటి అదనంగా 10 శాతం అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుంది. 
  • ఎంపిరికల్ డేటా ఉంటే గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు
  • గవర్నర్ కి పంపిన బిల్లును ఆమోదించలేదు, అలాగని వెనక్కి పంపనూ లేదు
  • గవర్నర్ కి బిల్లును పంపి నెల కాదు, 6 నెలలు గడిచాయి
  • చట్టాన్ని సవాల్ చేయకుండా.. కేవలం ఆ చట్టం ఆధారంగా జారీ చేసిన జీవోపై మాత్రమే అభ్యంతరాలు చెబుతూ పిటిషనర్ల వాదనలు జరిగాయి
  • బిల్లులు పాస్ చేసే విషయంలో చట్ట సభల్లో భిన్నాభిప్రాయాలు, గొడవలు ఉంటాయి
  • కానీ ఈ బిల్లును అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించి పాస్ చేశాయి
  • లక్ష మంది ఎన్యుమరేటర్లు సమగ్రంగా సర్వే నిర్వహించారు
  • ఇదేదో ఫోర్జరీ చేసిన డేటా అని పిటిషనర్ అనుకుంటున్నారేమో.. 
  • కులగణన సర్వే కోసం ప్రభుత్వం ఎంతో శ్రమించింది, ప్రొఫెసర్లు, టీచర్లు ఎంతో మంది ఈ సర్వేలో భాగంగా ఉన్నారు
  • ఏక సభ్య కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగింది..  97 శాతం ఇంటింటి సర్వే జరిగింది.. 

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు:

  •  ట్రిపుల్‌ టెస్ట్‌ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు
  • 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధం
  • రాజ్యాంగ బద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం.. 2021 డిసెంబర్‌లో ట్రిపుల్‌ టెస్ట్‌పై మార్గదర్శకాలు
  • బీసీ జనాభా గణన కోసం డెడికేటెడ్‌ కమిషన్‌ వేయడం.. కమిషన్‌ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం తేల్చాలని ట్రిపుల్‌ టెస్ట్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
  •  బీసీ రిజర్వేషన్లపై పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు