టీఆర్ఎస్సే నా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది

టీఆర్ఎస్సే నా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది

హైదరాబాద్ లో తనపై పక్కా ప్రణాళికతోనే దాడికి ప్రయత్నించారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. టీఆర్ఎస్సే తన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. పదునైన ఆయుధంతో దాడి చేసే అవకాశం ఉన్నంత దగ్గరగా టీఆర్ఎస్ కార్యకర్త వచ్చాడన్న ఆయన.. ఓ రాజకీయ నేత ఇలాంటి పనులు చేస్తే అది అసభ్యంగా ఉంటుందన్నారు. ‘‘ఇది భారతదేశం..అథితులను గౌరవించే సంప్రదాయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరించింది. దీనిపై నేనేం కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు’’  అని  హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ కు సీఎం హిమంత్ బిశ్వ శర్మ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ​కార్యకర్త నందకిషోర్ స్టేజీ పైకి వచ్చి మైకును లాక్కున్నారు. ఇది  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్  గా మారింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని నందకిషోర్ ను అరెస్ట్​ చేసి అబిడ్స్​ పీఎస్​కు తరలించారు.