హైదరాబాద్ లో తనపై పక్కా ప్రణాళికతోనే దాడికి ప్రయత్నించారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. టీఆర్ఎస్సే తన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. పదునైన ఆయుధంతో దాడి చేసే అవకాశం ఉన్నంత దగ్గరగా టీఆర్ఎస్ కార్యకర్త వచ్చాడన్న ఆయన.. ఓ రాజకీయ నేత ఇలాంటి పనులు చేస్తే అది అసభ్యంగా ఉంటుందన్నారు. ‘‘ఇది భారతదేశం..అథితులను గౌరవించే సంప్రదాయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరించింది. దీనిపై నేనేం కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు’’ అని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
Assam | We were at zero distance. He could've attacked me with a sharp weapon. If a political party's member does such a thing then it looks indecent. It was against India's culture of 'Atithi Devo Bhava'. Telangana govt should take action: CM Himanta Biswa Sarma https://t.co/mSfL6Em8AW pic.twitter.com/tyMX4JSsTG
— ANI (@ANI) September 10, 2022
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ కు సీఎం హిమంత్ బిశ్వ శర్మ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త నందకిషోర్ స్టేజీ పైకి వచ్చి మైకును లాక్కున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని నందకిషోర్ ను అరెస్ట్ చేసి అబిడ్స్ పీఎస్కు తరలించారు.