
ఈ మధ్య ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగూతేనే ఉన్నాయి. లేటెస్ట్ గా జూన్ 3న ఉదయం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది.
రాజేందర్ నగర్ నుంచి ఆరంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నెంబర్ 250 హెచ్ఎఫ్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు అతడిపి స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వాహనం ఎవరిది.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేశారా? లేదా అనే కోణం పోలీసులు ఆరాదీస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారాంగా వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై,జనావాసాల్లో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులు సూచిస్తున్నారు పోలీసులు.