మోకిల ఫేజ్ 2లో ప్లాట్ల వేలం.. హెచ్ఎండీఏ నోటిఫికేషన్

మోకిల ఫేజ్ 2లో ప్లాట్ల వేలం.. హెచ్ఎండీఏ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల ఫేజ్ 2లో 300 ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 300  నుంచి 500 గజాల వరకు ప్లాట్లను వేలం వేయనున్నారు. 

300 గజాల ప్లాట్లు 195 ఉండగా, 375 గజాలవి 59, 400 గజాలవి 20 ఉన్నాయి. గజం ధర రూ.25 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ వేలం ద్వారా సుమారు రూ.850 కోట్ల రెవెన్యూ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 29 వరకు (26, 27 మినహా) ఆన్ లైన్ లో వేలం జరగనుంది. 5 రోజుల పాటు జరగనున్న వేలంలో ప్రతి రోజూ 60 ప్లాట్లను వేలం వేయనున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

 ఈ నెల 17న మోకిల ఈ వేలానికి సంబంధించి ప్రీ బిడ్డింగ్​ను హెచ్ఎండీఏ నిర్వహించనుంది. గతంలో మోకిల ఫేజ్ 1లో 50 ప్లాట్లను వేలం వేయగా రూ.121.40 కోట్ల రెవెన్యూ వచ్చింది.