బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..

బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..

బాచుపల్లిలో గోడకూలిన ఘటనలో పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. మే 9వ తేదీ గురువారం భవననిర్మాణ దారుడు అరవింద్‌రెడ్డి, సైట్‌ ఇంజినీర్‌ సతీష్‌, ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సిస్‌, గుత్తేదారు రాజేష్‌ తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కూకట్ పల్లి పోలీసులు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరపర్చనున్నట్లు తెలిపారు.

మే 7వ తేదీ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 30 అడుగుల రిటైనింగ్ వాల్ కూలి సెంట్రింగ్ కార్మికుల షెడ్ పై పడింది. దీంతో ఏడుగురు కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. వీరిని  హాస్పిటళ్లకు తరలించారు.

 మృతుల్లో ఇద్దరు మహిళలు, 4 ఏళ్ల బాబు ఉన్నారు.  మృతి చెందిన కార్మికులను ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ  ఘటనపై బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.