హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల13, 14 తేదీల్లో.. సికింద్రాబాద్-కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ మేరకు మే 9వ తేదీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికల్లో 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. ఏపీకి చెందిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్తో పాటు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. దీంతో వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. సికింద్రాబాద్-కాకినాడ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు సిద్ధమైంది.