మోకీల, షాబాద్​లో ప్లాట్ల వేలం

మోకీల, షాబాద్​లో ప్లాట్ల వేలం
  • నోటిఫికేషన్ ఇచ్చిన హెచ్ఎండీఏ

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా షాబాద్, మోకీలలో ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో ప్రాంతంలో 50 చొప్పున మొత్తం 100 ప్లాట్లను వేలంలో ఉంచింది. మోకీలలో గజం రూ.25 వేలను కనీస ధరగా నిర్ణయించగా.. షాబాద్ లో కనీస ధర రూ.10 వేలుగా నిర్ణయించారు. 

మోకీలలో 325 నుంచి 433 గజాల వరకు ఉండగా.. షాబాద్ లో 300 గజాల ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాట్ కు డిపాజిట్ ధరను రూ.1లక్షగా, రిజిస్ర్టేషన్ ఫీజు రూ.1180 గా ఖరారు చేశారు. వచ్చే నెల 4 వరకు రిజిస్ర్టేషన్ కు గడువు విధించగా అదే నెల 7,8 తేదీల్లో ఆన్ లైన్ లో వేలం జరగనుంది.