హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యాసంస్థల్లో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటించింది. నిరుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరుగుతాయని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హారిజాంటల్ రిజర్వేషన్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన హైకోర్టు.. వారి పిటిషన్ను మంగళవారం కొట్టేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హారిజాంటల్ రిజర్వేషన్ను అమలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హారిజాంటల్ పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలవుతాయని, మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లేమీ ఉండవని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు స్పష్టం చేసింది.