హనుమకొండ జిల్లాలో.. వీరభద్రుని హుండీ ఆదాయం రూ.4.19లక్షలు

హనుమకొండ జిల్లాలో.. వీరభద్రుని హుండీ ఆదాయం రూ.4.19లక్షలు

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు భక్తులు కానుకల రూపంలో రూ.4లక్షల19వేలు సమర్పించినట్లు దేవాదాయ ఇన్​స్పెక్టర్​జి.సంజీవరెడ్డి తెలిపారు. లెక్కింపులో ఆలయ ఈఓ కిషన్​రావు, అర్చకులు పాల్గొన్నారు.