భార్యను రోకలితో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలితో కొట్టి చంపిన భర్త

భార్య ప్రవర్తనపై విసుగుచెందిన ఓ భర్త రోకలి తో హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ ఉప్పల్ లో జరిగింది.శ్రీనివాసరావు, సుశీల దంపతులు లక్ష్మీనారాయణ కాలనీలో నివాసముంటుంన్నారు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగున్నాయి. ఈ మధ్య గొడవలు కాస్తా ఎక్కువ కావడంతో ఆగ్రహంతో భార్య సుశీలను రోకలితో తలపై మోదాడు. బలమైన గాయం కావడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు శ్రీనివాస రావు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న శ్రీనివాస రావు కోసం గాలింపులు చేపట్టారు.