PSలో భార్య ఫిర్యాదు: రోడ్డుపై భర్త ఆత్మహత్యా యత్నం

PSలో భార్య ఫిర్యాదు: రోడ్డుపై భర్త ఆత్మహత్యా యత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మేయిన్ రోడ్డుపై ఓవ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బోయిన్ పల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన నక్క నారాయణ అతని భార్యతో కలిసి కొంతకాలం నుంచి సిరిసిల్లలో ఉంటున్నారు. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా..  సత్యనారాయణ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పాటు పోలిస్టేషన్ లో భర్తపై కంప్లేంట్ ఇచ్చింది. అయితే భార్య ఫిర్యాదుతో సత్యనారాయణ కలత చెందారని అందుకే.. ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు తెలిపారు.