హుజూర్ నగర్ బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

హుజూర్ నగర్ బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

హుజూర్ నగర్ ఉప ఎన్నిక లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సూర్యాపేట జిల్లా అధికారులు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కు 15 నుండి 20 నిమిషాలు పట్టే అవకాశముంది. తుది ఫలితం మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చే ఛాన్సుందన్నారు కలెక్టర్ అమాయ్ కుమార్.