రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో గుర్తు తెలియని మహిళను దుండగులు హత్య చేసి సజీవదహనం చేశారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పక్కనే సగం కాలిన మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళనె ఎక్కడో చంపి మొయినాబాద్ లో కాల్చినట్లు పోలిసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డీసీపీ రేష్మి మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మహిళ ఎవరు.. ఎందుకు చంపారు..మహిళను హత్యాచారం చేసి చంపారా లేక హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.