చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడ్డ సంచలన నిజాలు

చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడ్డ సంచలన నిజాలు

చంపాపేట్‌ స్వప్న మర్డర్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. స్వప్న, హన్మంతులది హత్యా..? ఆత్మహత్యనా? లేక ఎవరైనా సుఫారి ఇచ్చి చంపించారా? పోలీసులకు చిక్కిన సీసీ ఫుటేజీలో ఉన్న ఆ ఇద్దరు ఎవరు..? అనేది ప్రస్తుతం హైదరాబాద్ నగరం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. 

(అక్టోబర్ 28)నిన్న ఉదయం హైదరాబాద్ లోని చంపాపేట్ లో జరిగిన స్వప్న అనే యువతీ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మృతి చెందిన స్వప్న అనే యువతి గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు ప్రేమ్ కుమార్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తర్వాత కూడా మాజీ ప్రియుడు అయినటువంటి సతీష్ తో కాంటాక్ట్ లో ఉంది. అయితే సతీష్ చంపాపేట్ లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ.. పోతూ ఉండేవాడు.

ఈ నేపథ్యంలో స్వప్నకు తన భర్త ప్రేమ్ మధ్య ఇటీవల గొడవలు జరిగాయి. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. కాగా నిన్న(అక్టోబర్ 28) ఉదయం 11:30 గంటలకు చంపాపేట్ లోని స్వప్నఇంటికి తన మాజీప్రియుడు సతీష్ అతని స్నేహితునితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందే ఏమోగాని.. సతీష్ స్వప్న గొంతు కోసి హత్య చేశాడు. 

అనంతరం ప్రేమ్ ను రెండవ అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం స్వప్న భర్త ప్రేమ్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పడు ప్రేమ్ పరిస్థితి వివషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.